రూ.1000 దాటితే అదనపు ఫీజులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త! ఎస్బీఐ కార్డ్ తన ఫీ నిర్మాణంలో కీలక మార్పులు చేసింది. నవంబర్ 1, 2025 నుండి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా రూ.1000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1% ఫీ చెల్లించాల్సి ఉంటుంది.
🎓 థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లకు 1% ఫీ
క్రెడ్, మొబి క్విక్, చెక్ వంటి యాప్స్ ద్వారా విద్యా చెల్లింపులు చేసినప్పుడు ట్రాన్సాక్షన్ మొత్తం మీద 1% ఫీజు వసూలు చేస్తారు. అయితే పాఠశాలలు లేదా కళాశాలల్లో పీఓఎస్ ద్వారా నేరుగా పేమెంట్లు చేసిన వారికి మాత్రం ఎలాంటి ఫీ ఉండదని ఎస్బీఐ కార్డ్ స్పష్టం చేసింది.
💰 వాలెట్లో రూ.1000 కంటే ఎక్కువ లోడ్ చేస్తే ఛార్జీ
ఇకపై Paytm, PhonePe వంటి డిజిటల్ వాలెట్లలో రూ.1000కిపైగా లోడ్ చేసినా 1% ట్రాన్సాక్షన్ ఫీ వర్తిస్తుంది. ఈ నియమం ఎంపిక చేసిన మెర్చంట్ కోడ్స్ (MCC 8211, 8220, 8241, 8249, 8299)కు వర్తిస్తుందని తెలిపింది.
🧾 ఇతర సేవలపై ఫీజులు
క్యాష్ పేమెంట్ ఫీ: ₹250
చెక్ పేమెంట్ ఫీ: ₹200
క్యాష్ అడ్వాన్స్ ఫీ: 2.5% (కనీసం ₹500)
కార్డ్ రీప్లేస్మెంట్ ఫీ: ₹100–₹250 (ప్రీమియం కార్డులకు ₹1500 వరకు)
లేట్ పేమెంట్ ఫీ:
₹500 వరకు → ఫీ లేదు
₹500–₹1,000 → ₹400
₹1,000–₹10,000 → ₹750
₹10,000–₹25,000 → ₹950
₹25,000–₹50,000 → ₹1,100
🌍 విదేశీ ట్రాన్సాక్షన్లకు అధిక చార్జీలు
విదేశాల్లో ఎమర్జెన్సీ కార్డ్ రీప్లేస్మెంట్కు వీసా కార్డులకు $175, మాస్టర్కార్డులకు $148 ఫీ నిర్ణయించారు. అంతర్జాతీయ ఏటీఎంలలో క్యాష్ అడ్వాన్స్ ఫీ కూడా 2.5%గా ఉంటుంది.
⚠️ వినియోగదారులకు సూచన
ఎస్బీఐ కార్డ్ యూజర్లు తమ ట్రాన్సాక్షన్ పద్ధతులను సమీక్షించుకోవడం, చెల్లింపులు సమయానికి చేయడం, వాలెట్ లోడింగ్ను పరిమితంగా ఉంచడం మంచిదని ఫైనాన్షియల్ నిపుణులు సూచిస్తున్నారు.


