కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు మరో సంతోషకర వార్త. డీఏ పెంపు తర్వాత ఇప్పుడు వైద్య భారం తగ్గించే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. దాదాపు 15 సంవత్సరాల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) ప్యాకేజీ రేట్లను సవరించింది. కొత్త రేట్లు అక్టోబర్ 13, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.
కొత్త CGHS ప్యాకేజీ రేట్లు – కీలక వివరాలు
సీజీహెచ్ఎస్ (CGHS) డైరెక్టరేట్ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం,
సుమారు 2,000 వైద్య ప్రొసీజర్ల ధరలను సవరించారు.
దీంతో ఉద్యోగులు, పెన్షనుదారులకు చికిత్స ఖర్చుల భారం తగ్గనుంది.
గత 15 ఏళ్లుగా పాత రేట్లే అమలులో ఉండటంతో ఆసుపత్రులు, రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కేంద్రం గుర్తించింది. అనేక ఫిర్యాదుల అనంతరం ఈ మార్పు తీసుకొచ్చింది.
ఉద్యోగులు, పెన్షనుదారులకు ఉపశమనం
ఇటీవలి కాలంలో సీజీహెచ్ఎస్ అనుబంధ ఆసుపత్రులు క్యాష్లెస్ ట్రీట్మెంట్ (Cashless Treatment) నిరాకరించడం,
రీయింబర్స్మెంట్ (Reimbursement) కోసం నెలల తరబడి వేచి చూడాల్సి రావడం వంటి సమస్యలు విస్తరించాయి.
ఈ నేపథ్యంలో సవరించిన రేట్లు సమానమైన సేవలకు సరైన చెల్లింపులు అందించేందుకు దోహదపడతాయని అధికారులు తెలిపారు.
కేంద్రం స్పష్టత – ఎవరికీ వర్తిస్తాయి?
సీజీహెచ్ఎస్ అక్టోబర్ 3న జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం,
అనుబంధంగా లేని హెల్త్కేర్ ఆర్గనైజేషన్స్ (HCOs) లో చికిత్స పొందిన వారికీ ఈ రేట్లు వర్తిస్తాయి.
అయితే ఆ సంస్థలు NABH ప్రమాణాలు పాటించకపోతే,
నాన్-ఎన్ఏబీహెచ్ రేట్ల ప్రకారం రీయింబర్స్మెంట్ అందించబడుతుంది.
ఈ సవరించిన రేట్లు అన్ని CGHS అనుబంధ ఆసుపత్రులు, ఉద్యోగులు,
పెన్షనుదారులు మరియు ఇతర అర్హులైన వ్యక్తులు సమర్పించే రీయింబర్స్మెంట్ క్లెయిమ్స్కి వర్తిస్తాయి.
ఎందుకు ముఖ్యమైంది ఈ మార్పు?
2009 తర్వాత ఇదే తొలి ప్రధాన సవరణ.
సుమారు లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనుదారులకు ప్రయోజనం.
ఆరోగ్య సేవల అందుబాటు, నాణ్యత మెరుగుదల.
క్యాష్లెస్ చికిత్స సౌలభ్యం పెంపు.


