కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జీఎస్టీ రీఫార్మ్స్ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. సెప్టెంబర్ 22 (సోమవారం) నుంచి కొత్త జీఎస్టీ రేట్లు వర్తిస్తున్నాయి. ఇందులో భాగంగా, నిత్యావసర వస్తువులు, కొన్ని కీలక ఔషధాలు, స్టేషనరీ ఐటమ్స్పై జీరో జీఎస్టీ (Zero GST) వర్తించనుంది.
నిత్యావసర వస్తువులపై జీరో జీఎస్టీ
ఇకపై పాలు, UHT మిల్క్, పనీర్, బ్రెడ్, చపాతీ, రోటీ, పరాటా, పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా వంటి వస్తువులపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
- మదర్ డెయిరీ, హెరిటేజ్ ఫుడ్స్, అమూల్, పతంజలి వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించాయి.
- దీంతో డెయిరీ ఉత్పత్తులు మరింత చవక కానున్నాయి.
ఆరోగ్యానికి సంబంధించిన కీలక నిర్ణయం
ప్రభుత్వం 33 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్పై జీఎస్టీ పూర్తిగా మినహాయించింది.
- క్యాన్సర్ చికిత్సలో వాడే ఔషధాలు
- అరుదైన వ్యాధుల ట్రీట్మెంట్లో ఉపయోగించే కీలక మెడిసిన్స్
ఈ నిర్ణయం వల్ల రోగులపై ఉండే ఆర్థిక భారాన్ని తగ్గించనుంది.
విద్యార్థులు & ఆఫీసులకు ఊరట
స్టేషనరీ వస్తువులపై కూడా జీరో జీఎస్టీ వర్తించనుంది. వీటిలో:
- మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్
- పెన్సిల్స్, షార్పనర్స్, ఎరేజర్స్, క్రేయాన్స్, ప్యాస్టెల్స్
- నోట్బుక్స్, ఎక్సర్సైజ్ బుక్స్
- రైటింగ్ & డ్రాయింగ్ చాక్స్, టైలర్స్ చాక్స్, చాక్ స్టిక్స్
- డ్రాయింగ్ చార్కోల్స్
దీంతో స్కూల్ & ఆఫీస్ వినియోగదారులకు నేరుగా లాభం కలుగనుంది.
జీఎస్టీ స్లాబ్ మార్పులు – ధరలపై ప్రభావం
- 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు ఇప్పుడు 5% స్లాబ్లోకి వచ్చాయి.
- 28% స్లాబ్లో ఉన్న 90% వస్తువులు ఇప్పుడు 18% స్లాబ్కు తగ్గించబడ్డాయి.
- కార్లు, ఎలక్ట్రానిక్స్, వెహికిల్స్, ACలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు ధరలు తగ్గనున్నాయి.


